రాళ్లవాగును రక్షించాలి: బిఎస్పీ

Published: Friday January 13, 2023

మంచిర్యాల టౌన్, జనవరి 12, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ లైఫ్ హోటల్, మ్యాక్స్ కాంప్లెక్స్, కబంధ హస్తాల  నుండి రాళ్ల వాగు ను రక్షించాలని జిల్లా బిఎస్ పి నాయకులు గురువారం   జిల్లా కలెక్టర్  కార్యాలయంలో ఎ ఒ సురేష్ కు వినతి పత్రం అదజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని రాళ్ల వాగు రోజు రోజుకు పిల్ల కాలువల తయారు చేస్తూ రియల్ ఎస్టేట్ వారు, ఐ లైఫ్ హోటల్, మ్యాక్స్ కాంప్లెక్స్ వారు వ్యాపార సముదాయం కలిగిన వ్యక్తులు రాళ్ల వాగును కబ్జా చేస్తు కొత్త కొత్త నిర్మాణాలు చేస్తూ  ప్రహరి గోడలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రాళ్ళ వాగును రక్షించి కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి జిల్లా నాయకులు జాగిరి రాజేష్, ఎన్ సి పి రాష్ట్ర కార్యదర్శి జుమ్మిడి గోపాల్, తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు బచ్చలి ప్రవీణ్ కుమార్, టీవీఎస్ జిల్లా అధ్యక్షులు రేగుంట క్రాంతి కుమార్, ఎన్ ఎస్ సి  జిల్లా అధ్యక్షులు పురేళ్ళ నితీష్ తదితరులు పాల్గొన్నారు.