పక్షవాతానికి గురైన వ్యక్తికి ఆర్థిక సహాయం

Published: Wednesday April 12, 2023
ఎర్రుపాలెం, ఏప్రిల్ 11ప్రజాపాలన ప్రతినిధి ఎర్రిపాలెంం మండలం ఎర్రిపాలెం గ్రామం చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు  దేవరకొండ వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారని తెలుసుకొని  ఎర్రుపాలెం  మండల ఎస్సై  సురేష్ మరియు పెగళ్ళపాడు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఒక రైస్ బ్యాగు,రూ.10000/- అందజేశారు. ఈ కార్యక్రమంలో పెగళ్ళపాడు సర్పంచ్ సగ్గుర్తి రాజేశ్వరి వెంకటేశ్వర్లు ,ఎంపీటీసీ  సగ్గుర్తి కిషోర్ బాబు, యూత్ సభ్యులు సగ్గుర్తి.కృష్ణ చైతన్య , సగుర్తి ముత్యాలరావు , నండ్రు రాంబాబు , గూడూరు. నరసింహారెడ్డి ,నండ్రు వెంకటరత్నం , సగ్గుర్తి చంటి  పాల్గొన్నారు.