మత్స్య గిరేంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రసమయి శంకరపట్నం జనవరి 23 ప్రజాపాలన రి
Published: Tuesday January 24, 2023
శంకరపట్నం మండలం కొత్తగట్టు లోని శ్రీ మత్స్య గిరేంద్ర స్వామి ఆలయంలో సోమవారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 28 అడుగుల మత్స్య గిరింద్ర స్వామి విగ్రహా ప్రతిష్టాపనకు భూమి పూజ నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన ఆలయ చైర్మన్ మల్హల్ రావును ఆలయ కమిటీ డైరెక్టర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మానకొండూరు జెడ్పిటిసి శేఖర్ గౌడ్, మండల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: