మండలంలోని శైవ క్షేత్రాల్లో జువ్వా డి ప్రత్యేక పూజలు
కోరుట్ల, ఫిబ్రవరి 20 ( ప్రజాపాలన ప్రతినిధి ): మల్లాపూర్ మండలంలోని శైవ క్షేత్రలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరుట్ల నియోజక వర్గం మల్లాపూర్ మండలంలోని పురాతన ప్రాశస్త్యం ఉన్న వేంపల్లి గ్రామంలోని శివాలయంలో జరిగిన జాతరలో పాల్గొని మూలవిరాట్ ఆయిన పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే కుస్తాపూర్ గ్రామాల్లోని శివాలయంలో జరిగినటువంటి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు శేష వస్త్రాలను జువ్వా డి కృష్ణారావుకు అందజేశారుఆయా దేవాలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో జువ్వడి కృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని పాడిపంటలతో తులతూగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకున్నట్టు కృష్ణారావు పూజల అనంతరం విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతు శేఖర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ గౌడ్, మండల పరిషత్ సభ్యులు మరి పెళ్లిమల్లయ్య, వివిరావ్ పేట మాజీ సర్పంచ్ మిట్టపల్లి జలపతి రెడ్డి,మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి రాజోజూ సదానంద చారి, సుద్దపెల్లి మల్లయ్య, వంశీ ,బోడ సాయికిరణ్, దొనపల్లి సురేష్, వంశీ కట్టే కార్తీక్ బాస మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: