పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday July 13, 2021
మధుర, జులై 12, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీమొదటిగా మధిర మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో మధిర మండల మరియు పట్టణ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు జరగనున్న ఐటి మరియు మున్సిపల్ శాఖ మాత్యులు KTR గారి పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షర్చన ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మధిర మండల మరియు పట్టణ పరిధిలో ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మాట్లాడుతూ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని మదిర నియోజకవర్గ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులంతా అధిక సంఖ్యలో మొక్కలు నాటి కేటీఆర్ గారి పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని సూచించారుఅనంతరం మండల గ్రామ నాయకులతో మాట్లాడి గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకునీ సమస్యల పరిష్కారానికి అతి త్వరలోనే మనందరం కృషి చేయాలని అన్నారు అనంతరం దెందుకూరు గ్రామంలో కోట విజయశాంతి గారి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి లో భాగంగా మొక్కలు నాటారు అనంతరం బంజారా కాలనీవాసులు ప్రేమ్ కుమార్ దుర్గ గార్ల కుమార్తె కుమారుల రెడ్డి గార్డెన్స్ లో జరుగుతున్నటువంటి ఓరుగంటి తులసి కుమార్, వాణి ల పంచల మరియు ఓనీల వేడుకకు హాజరై చిన్నారుల దీవించారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ మరియు మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.