దళిత బంధు వాహనం ద్వారా అభివృద్ధి చెందాలి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Wednesday November 09, 2022

 

బెల్లంపల్లి నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: దళితులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, కేసీఆర్  తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని అన్నారు.
మంగళవారం నియోజకవర్గంలోని కాసిపేట మండల కేంద్రానికి చెందిన రవికి, దళిత బంధు ద్వారా వచ్చిన వాహనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం, దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పథకమని, ఈ పథకం ద్వారా వచ్చిన వాహనాలు, షాపులు, ఇతరత్రా పరిశ్రమలు స్థాపించిన వారు వాటిని సద్వినియోగం చేసుకొని బాగుపడాలని, ముందు తరాలకు వీటి ప్రాముఖ్యతను వివరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రయ్య , వైస్ ఎంపీపీ విక్రమ్ , ఎంపీటీసీలు లక్ష్మీ , రాంచందర్ , ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు సత్తయ్య , తిరుపతి రెడ్డి, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.బెల్లంపల్లి నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: దళితులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, కేసీఆర్  తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని అన్నారు.