జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయండి రాష్ట్ర కమిటీ సభ్యులు శివ రాల లక్ష్మయ్య

Published: Tuesday March 15, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 14 ప్రజాపాలన ప్రతినిధి : ఈ నేల 15న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలపై కలెక్టర్ ఆఫీస్ ముట్టడించనున్నట్టు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సివరాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు దళిత బంధువు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులకు 3 ఎకరాల భూమి 57 సంవత్సరాలు నిండిన వారికి మూడు వేల పెన్షన్ మరియు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు సంవత్సరం కూలీలు 200 రోజులు పనులు కల్పించాలని రోజు కూలీలకు 600 రూపాయలు ఇవ్వాలని తదితర సమస్యలపై వెంటనే పరిష్కరించాలని కోరారు ఇబ్రహీంపట్న మంచాల యాచారం అబ్దుల్లాపూర్మెట్ మండల లు కార్యకర్తలు ఉపాధిహామీ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.