జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మరణించిన కుటుంబానికి నివాళి..

Published: Thursday November 25, 2021
ఎర్రుపాలెం నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామ సర్పంచ్ కొత్తపల్లి విద్యాసాగర్ రావు గారి తండ్రి కొత్తపల్లి ప్రకాశం గారు అనారోగ్యంతో మరణించడం తో వారి పార్థివదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. ఈ కార్యక్రమంలో మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, సర్పంచ్ మొగిలి అప్పారావు, కృష్ణారెడ్డి, ఇనగాలి ఎంపీటీసీ పొట్ట పింజర నరసింహ, రామన్నపాలెం సొసైటీ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి, పురుషోత్తం రాజు, కొండపాక సాంబశివరావు, బుర్ర నారాయణరావు, దేవరకొండ చిరంజీవి, ఇనప నూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.