వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఆహార పంపిణీ

Published: Thursday July 14, 2022
మంచిర్యాల టౌన్, జూలై 13, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ భారీ వర్షాల వలన వరదకు ముంపునకు గురి కావడంతో మాత శిశు ఆసుపత్రి నుండి మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించిన పేషేంట్లకు , ఎన్టీఆర్ నగర్ వాసులు,  పునరావాసం పొందుతున్న బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  ఆదేశాల మేరకు బుధవారం రోజున అల్పాహారం, మధ్యాహ్న భోజనం పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.