రైతులకు నష్టపరిహారం అందించాలి

Published: Wednesday November 17, 2021
బీజేపీ మండల అధ్యక్షుడు రామారావు..
తల్లాడ, నవంబర్ 16 (ప్రజాపాలన న్యూస్) : నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందించాలని బీజేపీ తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకటరామారావు డిమాండ్ చేశారు. బుధవారం రైతాంగ సమస్యలపై తహశీల్దార్ గంట శ్రీలతకు వినతిని అందించారు. మండలంలోని అన్నారుగూడెం, గోపాలపేట, మల్లవరం, బిల్లుపాడు తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి విత్తనాల్లో నకిలీ విత్తనాలు ఉండటం వల్ల కోత దశకు వచ్చిన కంకులు లేవని పేర్కొన్నారు. రైతులు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట నాయకులు తేజావత్ బాలాజీ, వాడవల్లి నాగేశ్వరరావు, గాదె కృష్ణారావు, వెంకటేశ్వరరావు, రాగం రాము ఉన్నారు.