అనిల్ రాజా పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. ప్రజాపాలన) చేవెళ్ల 06: -

Published: Monday November 07, 2022

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మహిళ సమైక్య ప్రధాన కార్యదర్శి అనిల్ రాజా పై పెట్టిన కి అక్రమ కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర మహిళా సంఘం పిలుపుమేరకు సిపిఐ మహిళ సంఘం నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మేమరాండం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, విజయములు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు హత్యలు దోపిడి దౌర్జన్యాలు జరుగుతున్న మహిళల భద్రత లో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ప్రభుత్వమే దౌర్జన్యాలు చేసి కేసులు బనాయిస్తే ఏమిటని,అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకులు కంసమ్మ మంజుల  మనీలా, వినోద, లక్ష్మి  భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.