పారిశ్రామికవేత్తలకు తాయిలాలు.. నిరుపేదలకు భారాలా..?

Published: Saturday March 04, 2023
 తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వినూత్న నిరసన..
 
తల్లాడ, మార్చి 3 (ప్రజాపాలన న్యూస్): 
దేశంలో నీరవ్ మోడీ, అంబానీ, ఆదాని లాంటి పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల్లో తాయిలాలు కల్పిస్తూ.. నిరుపేదలపై భారాలు మోస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఘాటుగా విమర్శించారు.  కేంద్రప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం తల్లాడలో వినూత్న రీతిలో ఆయన కట్టెలను ఎత్తుకొని ర్యాలీ ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రూ. 400 ఉన్న గ్యాస్ ను ఇప్పుడు 1200పైగా పెంచడం పేదలపై భారాలు మోపడేమేనన్నారు. పేదలపై బారాలు వేస్తూ పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి దిరిశాల ప్రమీల, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.