చిల్కానగర్ డివిజన్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన జిహెచ్ఎంసి అధికారులు
Published: Thursday October 28, 2021
మేడిపల్లి, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : చిల్కానగర్ డివిజన్లో అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు. డివిజన్లో జి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకుని అక్రమంగా మరో ఫ్లోర్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్, కింద సెంటర్స్ వేస్తున్న రెండు ఇండ్లను బుధవారం నాడు అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారులు పేర్కొన్నారు.
Share this on your social network: