ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

Published: Wednesday May 05, 2021
కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్ 
మేడిపల్లి, మే4 (ప్రజాపాలన ప్రతినిధి) : ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది చేపడుతున్న రంజాన్ కానుకలను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్లోని బీరప్పగడ్డ మసీదులో 300 మంది ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు  బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మస్జిద్ ఈ మునువార  అధ్యక్షులు అజీజ్, ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, సభ్యులు మాక్బూల్, రషీద్, తౌసిమ్, హైదర్, నూర్, జహిద్, ముస్తాక్, అజమ్, మోయిన్, అల్తాఫ్.మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు  ఏదుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, ఇర్షద్ ఖాన్, మాస శేఖర్, అడ్వకేట్ జగన్, పుష్ప రాజ్, బింగి శ్రీనివాస్, బాలు, ఎన్. శ్రీకాంత్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.