మండలంలో ప్రవేశించే పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలకాలి: కాంగ్రెస్ పార్టీ మం

Published: Monday March 28, 2022
బోనకల్, మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి: మధిర శాసనసభ్యులు సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఏప్రిల్ 2 న ఉదయం 8 గంటలకు బోనకల్ మండలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు కోరారు. ఆదివారం స్థానిక మండల పరిధిలోని ముష్టికుంట్ల, చిరునోముల,చొప్పకట్లపాలెం గార్లపాడు,రామాపురం,గోవిందపురం, లక్ష్మీపురం,తుటికుంట్ల గ్రామాల్లో గల కాంగ్రెస్ పార్టీ నాయకులతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పాదయాత్రకు ప్రతి గ్రామం, ప్రతి వార్డ్ నుంచి కుటుంబ సమేతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు, సానుభూతిపరులు, వివిధ రాజకీయ అనుబంధ పార్టీల నాయకులూ సంఘీభావం తెలిపేందుకు అధిక సంఖ్యలో పాల్గొని భట్టి చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టాలని కోరారు. అలాగే గ్రామాల్లో రైతులు, కార్మికులు, మహిళలు, వృద్దులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకురావాలనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటి రామకోటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు,గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.