దుస్తులను పంపిణీ చేసిన ఎంఈఓ విజయ్ కుమార్

Published: Wednesday April 19, 2023

జన్నారం, ఏప్రిల్ 18, ప్రజాపాలన: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల  దుస్తులను, ఆయా ప్రభుత్వ పాఠశాలలకు ఎంఈఓ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. మంగళవారం మండలంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులు ధరించి వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దుస్తులను ముందుగా వచ్చే జూన్ 12వ అల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని విద్యార్థుల కొలతల ప్రకారం గుర్తించి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతనోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.