విద్యార్థులకు పుస్తకాలు వితరణ..
Published: Friday August 05, 2022
తల్లాడ, ఆగస్టు 4 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మిట్టపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్ లో నోట్ బుక్స్ వితరణ చేశారు. లైన్స్ క్లబ్ డిసి మిట్టపల్లి నరసింహారావు ఈ పుస్తకాలను వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో పులబాల వెంకటేశ్వర్ల, గుంటుపల్లి వెంకటేశ్వరరావు , హెచ్ఎం ప్రభావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: