మానవత్వం చాటుకున్న ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్

Published: Friday February 10, 2023
 రెడ్డి మధిర రూరల్ ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో.మంగళవారం గుర్తు తెలియని ట్రైన్  నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయి బతుకు బట్ట కట్టి ఖమ్మంపాడు గ్రామ సమీపంలోని సుబాబుల్లలో కనీసం కట్టుబట్లు లేకుండా తిరుగుతున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన యువకుడ్ని తన విధుల్లో భాగంగా ఖమ్మంపాడు గ్రామ విజిటింగ్ కి వెళ్తున్న మధిర ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి ఆ యువకుడ్ని గుర్తించి ఆర్కే రెస్క్యూ టింమ్ ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణకు సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించగా ఆర్కే రెస్క్యూ టీమ్ హుటా హుటిన ఘటన స్థలానికి వెళ్లి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆ యువకుడ్ని  ఫౌండేషన్కు తరలించి అతను ధరించడానికి కొత్త బట్టలను సమకూర్చారు.గురువారం ఉదయం యువకుడు సంబంధించిన కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకొని మధిర పట్టణంలోని ఆర్కే ఫౌండేషన్కు రాగా ఆ యువకుడ్ని ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.ఆర్కే పౌండేషన్ స్థాపకులు దోర్నాల రామకృష్ణకు, మధిర ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డికి యువకుడు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.