కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

Published: Tuesday April 19, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంజూరు అయిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఉపాధి శాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు 16 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు ప్రవేశ పెట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు, మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, సీనియర్ ఆఫీసర్ లు, సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.