జనసేన పార్టీ నియోజవర్గ నాయకులు తాళ్లూరీ డేవిడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు పాలభిషేకం

Published: Saturday July 02, 2022

మధిర జులై 1 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు నియోజవర్గం పరిధిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చికౌలు రైతులను ఆదుకున్న జనసేన  పవన్ పవన్ కళ్యాణ్మధిర ఆర్వి కాంప్లెక్స్ సర్కిల్ నందు నియోజవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర కౌలు రైతుల ఆదుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలభిషేకం చేసిన జనసేన పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో పాలభిషేకం చేయడం జరిగింది, ఈ సందర్భంగా మధిర నియోజవర్గ నాయకులు తాళ్లూరు డేవిడ్  మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఏ రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా తన కష్టాజీతంతో ఆదుకున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు,అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు రైతులని తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్,ప్రజల సమస్యల పైన పోరాడుతూ ప్రజల పక్షాన ఉంటూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు, రాబోయే రోజుల్లో మధిర నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాని మధిర నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో జనసేన పార్టీ జెండాని ఎగర వేస్తామనీ నియోజవర్గంలో పార్టీని బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మధిర జనసేన పార్టీ నాయకులు శివరామకృష్ణ, శ్యామ్, పగడాల పవన్, రిషి, బోనకల్ మండల నాయకులు, ఎస్.కె జానీపాషా, అద్దంకి సంతోష్ కుమార్, అరవపల్లి నరేష్, షేక్ బాజీ, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.