అంతర్గత ఖాళీల భర్తీకి పరీక్షలు

Published: Friday March 25, 2022
నస్పూర్, మార్చి 24, ప్రజాపాలన ప్రతినిధి: శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రంలో  అంతర్గత ఖాళీల భర్తీ కొరకు పరీక్షలు నిర్వహించారు. గురువారం భర్తీ ప్రక్రియలో భాగంగా అసిస్టెంట్ చైన్ మెన్ పోస్ట్ కు ప్రాక్టికల్, మున్షీ పోస్ట్ కి వ్రాత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలను జీఎం యం.సురేష్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు పదోన్నతి పొందడానికి అత్యంత పారదర్శకంగా, పకడ్పందిగా పరీక్షలు నిర్వహించి పదోన్నతులు కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోనిపదోన్నతులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులు ఎస్ఓ టూ జీఎం హరి నారాయణ గుప్తా, డీజీఎం పర్సనల్ గోవింద రాజు, డీజీఎం ఐఈడి చిరంజీవులు, ఏరియా సర్వే అధికారి రాఘవేంద్ర రావు, వృత్తి శిక్షణా కేంద్రం మేనేజర్ కల్లూరి వెంకట రామారావు పాల్గొన్నారు.