అంతర్గత ఖాళీల భర్తీకి పరీక్షలు
Published: Friday March 25, 2022
నస్పూర్, మార్చి 24, ప్రజాపాలన ప్రతినిధి: శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రంలో అంతర్గత ఖాళీల భర్తీ కొరకు పరీక్షలు నిర్వహించారు. గురువారం భర్తీ ప్రక్రియలో భాగంగా అసిస్టెంట్ చైన్ మెన్ పోస్ట్ కు ప్రాక్టికల్, మున్షీ పోస్ట్ కి వ్రాత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలను జీఎం యం.సురేష్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు పదోన్నతి పొందడానికి అత్యంత పారదర్శకంగా, పకడ్పందిగా పరీక్షలు నిర్వహించి పదోన్నతులు కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోనిపదోన్నతులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులు ఎస్ఓ టూ జీఎం హరి నారాయణ గుప్తా, డీజీఎం పర్సనల్ గోవింద రాజు, డీజీఎం ఐఈడి చిరంజీవులు, ఏరియా సర్వే అధికారి రాఘవేంద్ర రావు, వృత్తి శిక్షణా కేంద్రం మేనేజర్ కల్లూరి వెంకట రామారావు పాల్గొన్నారు.
Share this on your social network: