ఖాళీ స్థలాలలో జెసిబితో పిచ్చి మొక్కలను తొలగిస్తున్న టీఆర్ఎస్ నాయకులు బొమ్మక్ బాలయ్య

Published: Wednesday July 07, 2021
 మేడిపల్లి, జులై 6 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ వెస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మక్ బాలయ్య డివిజన్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి జెసిబితో రోడ్డుకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాలలో నెలకొన్న చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలను పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వెల్లంకి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి బైర బోయిన మల్లేశ్, కోశాదికారి ఉన్నం వెంకటేశ్, నాగరాజు, చక్రవర్తి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.