టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి మంత్రి మల్లారెడ్డి

Published: Friday April 22, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి డివిజన్లో, వాడవాడలా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి సూచించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, పార్టీ ప్రధానకార్యదర్శి మీసాల కృష్ణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కొత్త చందర్ గౌడ్, రసాల వెంకటేష్ యాదవ్, సింగిరెడ్డి పద్మరెడ్డి, బింగి జంగయ్య యాదవ్, జడిగే మహేందర్ యాదవ్, చీరాల నర్సింహా, దత్తాత్రేయ శాస్త్రి, బద్ధుల సత్యనారాయణ, ఎండి అలీం, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుులు, యూత్ విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.