విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి నాయకులు

Published: Monday October 25, 2021
మేడిపల్లి, అక్టోబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం  చేసుకొని మొక్కులు చెల్లించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి  వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, వేముల సంతోష్ రెడ్డి. తెలుగు ప్రజలతో పాటు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ  ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడు కొన్నట్లు తెలిపారు.