పత్రికా రంగంలో చెదరని ముద్ర వేసిన సియాసత్ ** "సియాసత్ ఉర్దూ దినపత్రిక 75 వ వార్షికోత్సవం" ** టీయూ

Published: Monday August 22, 2022
 ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 21 (ప్రజాపాలన,ప్రతినిధి) : పత్రికా రంగంలో "సియాసత్ ఉర్దూ దినపత్రిక" చెదరని ముద్ర వేసిందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ పేర్కొన్నారు. "సియాసత్ ఉర్దూ పత్రిక " 75 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లాలోని "సియాసత్ జర్నలిస్టులకు" శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా రహమాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక సంచలనమైన వార్తలు రాసి ప్రజల సమస్యల పరిష్కారానికై సియాసత్ తోడ్పడిందన్నారు . ఈ సందర్భంగా సియాసత్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అబ్దుల్ జమీల్, అబ్దుల్ గప్పార్, అబ్దుల్ సపిల్, ఏజాజ్ అహ్మద్ లను ఘనంగా సన్మానించి, సియాసత్ దినపత్రిక యాజమాన్యానికి, జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రకాష్ గౌడ్, అబ్దుల్ అన్నాన్, సురేష్ చారి, సోజర్, తిరుపతి, శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.