గుమ్మడి రాజలింగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

Published: Wednesday December 28, 2022

జన్నారం, డిసెంబర్ 27, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అల్లీనగర్, దొంగపల్లి, మల్యాల్, గిరిజన గ్రామాల్లో 300 మంది గిరిజన కుటుంబాలకు తాళ్లపేటకు చెందిన గుమ్మడి రాజలింగు పౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ డాక్టర్ గుమ్మడి కిరణ్ కుమార్, జన్నారం ఎస్ ఐ సతీష్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలికాలం దృష్టిలో ఉంచుకొని గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దాతలు ఎవరైనా ఉంటే గిరిజనులకు సహాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కిరణ్ స్వప్న, ఓయూ విద్యార్థులు శ్రీనివాస్, కిరణ్, డబ్ల్యూ సి ఎస్ ఇండియా రిప్రిసేంటిటివి వెంకట్, స్థానిక సర్పంచ్ హనుమంతు రావు, తదితరులు పాల్గొన్నారు.