టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసిన కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డి

Published: Wednesday April 28, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డి  నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ యుగేంధర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్ని సంవత్సరాల్లోనే సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.