పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Published: Saturday April 01, 2023
బీఆర్ఎస్ నాయకులు బండారి రవీందర్ 
 మేడిపల్లి, మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి)  
 పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రవీందర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని
 15వ డివిజన్లో 58 జీవో కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులైన శోభకు ఇండ్ల స్థలా పట్టా సర్టిఫికెట్ ను బండారి రవీందర్ అందజేశారు. 
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బత్తి సుమిత్ పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, సత్యం చారి లింగస్వామి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.