లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలి తుడుం దెబ్బ, ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకుల డిమ

Published: Saturday October 08, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: చట్టబద్ధతలేని లంబాడీలను గిరిజనుల జాబితా నుండి తొలగించాలని, తుడుం దెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు, శుక్రవారం డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీ,  నాన్ ఏజెన్సీ, గ్రామాలను గుర్తించి, ఏజెన్సీ గ్రామపంచాయతీలలో పీసా (PESA) చట్టాన్ని పకడ్ బందీగా అమలు చేయాలని, చట్టబద్ధతలేని లంబాడాలను, గిరిజన, ఆదివాసీల జాబితా నుండి తొలగించాలని తాండూరు మండల తాసిల్దార్ కు శుక్రవారం నాడు వినతి పత్రాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుర్సింగ బాబురావు, యాపల సమ్మయ్య,రెబ్బెన రామచందర్, తదితరులు పాల్గొన్నారు.