జర్నలిస్టు రామకృష్ణ కుటుంబానికి పొంగులేటి ఆర్థిక సహాయం

Published: Tuesday June 15, 2021
మధిర, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : నమస్తే తెలంగాణ రూరల్ విలేఖరి రామకృష్ణ కు ఇటీవల పితృవియోగం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విలేఖరి రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని మధిర ప్రెస్ క్లబ్ ద్వారా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్ని కోరడం జరిగింది. దీనికి స్పందించిన పొంగులేటి ఈరోజు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్లపాడు సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామరెడ్డి, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, రాము, ఎంపిటిసి పాల్గొన్నారు.