ఈనెల 10న మదర్స వార్షికోత్సవ సభ ** వార్షికోత్సవ పోస్టర్స్ ఆవిష్కరించిన ముస్లింలు **

Published: Monday March 06, 2023
ఆసిఫాబాద్ జిల్లా మార్చి 05 (ప్రజాపాలన,ప్రతినిధి): ఈ నెల 10 నమదర్స అరేబియా మదీనా తులుమ్ 10వ వార్షికోత్సవం వేడుకల సభ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని ముస్లింలు ఇతరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వహణ కమిటీ బాధ్యులు అబ్దుల్ ఫయాజ్ , అలీ బీన్ అహ్మద్ లు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మదర్స వార్షికోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని
"నూర్ నగర్ ఈద్గా వద్ద"  వార్షికోత్సవం సందర్భంగా ఖురాన్ ప్రత్యేకతపై సందేశం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ సభకు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ మగ్ధుం మోహిఒద్దిన్ తోపాటు మౌలానాలు హాజరు అవుతున్నట్లు తెలిపారు. ముస్లింలు ,ముస్లింయేతరులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్స వార్షికోత్సవ నిర్వాహన కమిటీ సభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా, అబ్దుల్ రహమాన్ (జర్నలిస్ట్) సయ్యద్ నిసార్, సాజిద్, సలం, షబ్బీర్,సల్మాన్ ఖాన్, ఎండీ అహ్మద్, సయ్యిద్ జావిద్, సయ్యద్ సోజర్, సలీం బెగ్, షేక్ చాంద్, తాజ్, ఇమ్రాన్, ఇమ్రాన్ హష్మీ,నజీర్, శాకిర్, మదర్స నిర్వాహకులు జాఫర్ సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.