ఉప్పల్లో గణేషుల నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
Published: Monday September 13, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నల్ల చెరువు సమీపంలోని కొలనులో కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి గణేషుల నిమజ్జనానికి ఏర్పాట్లను సిద్ధం చేశారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొలనులో వాటర్ రీఫిల్లింగ్ చేయించారు. ఇదే కాకుండా కొలను పరిసర ప్రాంతాలలో వెట్ మిక్స్, బారీకేట్లు, ఇతర సౌకర్యాలను రజిత పరమేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ వసంత, డివిజన్ అధ్యక్షులు బకారం లక్ష్మణ్, మామిన్ల సతిష్, తెలకల రాంరెడ్డి, పంగా దుర్గా రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, మంద మురళీ కృష్ణ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, పీటర్, సతిష్, ఢిల్లీ చంద్ర శేఖర్ రెడ్డి, జిత్తు రెడ్డి, రఘు, బంటి, కన్నమైన నరేష్ రాం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: