బిఆర్ఎస్ పార్టీలో పలురు మైనారిటీల చేరికలు ** జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి **

Published: Tuesday December 27, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 25 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి నివాసంలో పలువురు ముస్లిం సోదరీ సోదరీమణులు ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ కోవా లక్ష్మి, జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు సమక్షంలో పార్టీ కండువాను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోటౌన్ ప్రెసిడెంట్ హైమద్,నిషార్, నజీర్, ముస్లిం సోదరీ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.