దానవాయిగూడెంలో పలు కుటుంబాలను పరామర్శించిన బెల్లం వేణ

Published: Wednesday March 31, 2021
పాలేరు మార్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రూరల్ మండలం దానవాయిగూడెం లో ఈ మధ్యకాలంలో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన రూరల్ మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ రూరల్ జడ్పిటిసి సభ్యులు వరప్రసాద్, పలు కుటుంబాలను పరామర్శించి చనిపోయిన పలు కుటుంబాలకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దానవాయిగూడెంలో మరణించిన జీడి. బిక్ష్మం, చల్లా. వేంకటపతి, కొండ. వెంకటప్పయ్య, అక్కిపాల్లి, మహేశ్  కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ. అద్యక్షులు దామల. రవి, కార్యదర్శి గంగిసర్పా కొండలు, నల్లూరి మధు బాబు, నరేష్, పాసిని. కృష్ణ గౌడ్, బట్టపోతుల సతీష్, కోల. సత్యనారాయణ, ఎస్ కె భాష, ముల్క బాబ్జీ, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.