బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధ

Published: Monday April 03, 2023

ఎర్రుపాలెం, ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని జమాలపురం గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరుతున్నాయని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం నాడు ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో బాలాజీ భవన్ రెడ్డి గార్డెన్ నందు జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని యావత్ దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఎర్రుపాలెం మండల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తాం అన్నారు. రానున్న ఎన్నికల్లో మధిర అసెంబ్లీ పై కూడా గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.