టి ఆర్ ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కుల పంపిణి

Published: Thursday July 07, 2022
మంచిర్యాల టౌన్, జూలై 06, ప్రజాపాలన :  టి ఆర్ ఎస్ పార్టీ ప్రమాద భీమా పంపిణి మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం లో ప్రమాదశావత్తు చనిపోయిన కార్యకర్తలకు 2 లక్షలు పార్టీ ఇన్సూరెన్స్ మంజూరు చేశారు.
ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  ఆదేశాల మేరకు మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం లో మడిశెట్టి  శ్రీనివాస్,మంచిర్యాల పట్టణం లోని సీతారాం కాలనీ కి చెందిన గుమ్మడి మల్లేష్ లు ప్రమాదవశాత్తు మరణించగా వారికి తెరాస పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ ఇన్సురెన్స్ ద్వారా ఇరువురికి మంజూరు అయిన 2 లక్షల రూపాయల చెక్కులను వారి కుటుంబసభ్యులుకు, మంచిర్యాల టీఆర్ఎస్ యువ నాయకులు  నడిపెల్లి విజిత్ కుమార్ అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ ఛైర్మెన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, పట్టణ నాయకులు, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ , చించు శ్రీనివాస్ ,  వెంకటేష్ , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు