కార్పొరేషన్లోనే బడంగ్ పేట్ కార్పొరేషన్ అభివృద్ధి పనులకు ముందంజ

Published: Thursday February 11, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  18వ, 7వ ,19వ 32 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బుధవారం నాడు మేయర్ చిగిరింత పారిజాత నరసింహరెడ్డి శంకుస్థాపనలు చేశారు. 18వ డివిజన్ లో  శ్రీ సాయి నగర్ కాలనీలో సీసీ రోడ్డు, గుర్రంగూడ గ్రామంలో  7వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ గడ్డం లక్ష్మ రెడ్డి  సమక్షంలో రోడ్డు ప్యాచ్ వర్క్స్, అదేవిధంగా 19వ డివిజన్ కార్పొరేటర్ రామోజీ అమిత శ్రీశైలం చారి డివిజన్ కాలనీలో  సీసీ రోడ్డు, 32 డివిజన్ లో గౌర రమాదేవి శ్రీనివాస్ సమక్షంలో డ్రైనేజీ పనులకు కార్పొరేషన్ మేయర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ....మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రత్యేక చోరవ తీసుకోని అభివృద్ధి చేయడంలో మన కార్పొరేషన్ ముందంజలో ఉంటుందని అందుకు అందరూ సహకరించాలని ఆమె అన్నారు. ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో దశల వారిగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి వ్యాధి కి వ్యాక్సిన్ వచ్చిందినీ అజాగ్రత్తగా ఉండొద్దు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పరిశుభ్రతను కంపల్సరీ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో డీ.ఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు బండారి మనోహర్, గడ్డం లక్ష్మారెడ్డి, రామోజీ అమితా శ్రీశైలం చారి, గౌర రమాదేవి, దడిగ శంకర్, పెద్దబావి సుదర్శన్ రెడ్డి నాయకులు విష్ణువర్దన్ రెడ్డి, లిక్కి కృష్ణ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి శానిటైజర్ అధికారి యాదగిరి, మున్సీపల్ అధికారులు మరియు సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.