ఇటిక్యాలలో బీజేపీ ధర్నా

Published: Saturday January 21, 2023

రాయికల్, జనవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామములో బి.జె.పి గ్రామశాఖ ఆద్వర్యములోకరెంటు బిల్లుకు వ్యతిరేకంగాధర్నానిర్వహించారు.కార్యక్రమంలోనాయకులు మాట్లాడు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం  ఎ.సి. డి. చార్జిలతో పెద్దవాడి నడ్డి విరస్తున్నారని,  రెగ్యులర్ విద్యుత్తుబిల్లులు చెల్లిస్తున్న వేలలో బిల్లు రావడంతో  సామాన్య ప్రజలుఖంగుతిన్నారు.  ఓక చేతితో  పింఛన్ ఇచ్చి మరో చేతితో ఆడిషనల్ కన్సప్సన్ డిపాజిట్  (ఎ.సి.డి )రూపములో అధిక బిల్లులు  వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమములో ప్యాక్స్ చైర్మన్ మహిపతి రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్ రెడ్డి,శ్రీధర్ ఎలేటి జలంధర్ రెడ్డి శేఖర్ ఎన్జీ నరేష్ బీజేపీ నాయకులు తధితరులు పాల్గొన్నారు.