డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి

Published: Monday February 14, 2022
కార్పొరేటర్ సుభాష్ నాయక్
మేడిపల్లి, ఫిబ్రవరి 13 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్లో కొత్తగా ఏర్పాటవుతున్న ధరణి కాలనీలో కార్పొరేటర్ సుభాష్ నాయక్ పాదయాత్ర నిర్వహించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ సహాయంతో కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్దీపాలు, పార్కులు, హరితహారం వంటి మౌలిక వసతులను చేపట్టి అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ సుభాష్ నాయక్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పూరషోత్తం, కార్యదర్శి, లింగం యాదవ్, చెనరెడ్డి, బాలరాజ్, రవి నాయక్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.