నేతాకాని సంఘం ఆధ్వర్యంలో ఎ ఎమ్ సి డైరెక్టర్ కు సన్మానం

Published: Tuesday August 30, 2022

జన్నారం, ఆగస్టు 29, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లి నేతాకాని సంఘం  ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా కామన్ పల్లి గ్రామానికి చెందిన తేజావత్ భరత్ నాయక్ ను నేతాకాని సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగిందని కామన్ పల్లి ఉప సర్పంచ్ జునుగురు శ్రీనివాస్ సోమవారం అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీలో మంచి సేవలు అందింస్తానాని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ నాయకులు కామెర రాయలింగు, జునుగురు కిరణ్, జునుగురు గణేష్, జునుగురు లచ్చన్న, కామెర దుర్గయ్య, గ్రామ నేతాకాని సంఘ పెద్దలు కామెర లచ్చన్న, జునుగురు గంగన్న, కామెర బక్కన్న, జునుగురు ఉషయ్య, పసుల రాజన్న, గడ్డి జగన్, దుర్గం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.