వెంకటయ్య, లక్ష్మికి నివాళులర్పించిన ఎంపీపీ శ్రీనివాసరావు

Published: Friday September 30, 2022
 తల్లాడ, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన న్యూస్):
టిఆర్ఎస్ పార్టీ తల్లాడ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు (జి.వి.ఆర్) మాతృమూర్తి లక్ష్మి, అన్నారుగూడెంలో కొత్తపల్లి వెంకటయ్య ఇటీవల మృతిచెందారు. గురువారం వారి  దశదినకర్మకు తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో టిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట లాల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు శీలం కోటారెడ్డి, సర్పంచులు తూము శ్రీనివాసరావు, వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు మారెళ్ళ దేవేంద్ర రావు, వార్డ్ మెంబర్ రఘు తదితరులు ఉన్నారు.