మున్సిపాలిటీ అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం.

Published: Wednesday February 10, 2021

జీలుగుమాడులో 1, 8 వార్డులలో రూ 10 లక్షల నిధులతో సిసి రోడ్డుకు శంకుస్థాపన.

మధిర, ప్రజా పాలన; శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలోని జీలుగుమాడు గ్రామంలో ఒకటో వార్డు ఎనిమిదో వార్డు కలిపి ఉన్న రోడ్డుకు 10 లక్షలతో సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్  చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు దేవిశెట్టి రంగా, వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత వెంకట్ రెడ్డి, ఎంపీపీ లలిత, పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వరరావు, ఒకటో వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ, 8వ వార్డు కౌన్సిలర్ వై వి అప్పారావు, 14వ వార్డు కౌన్సిలర్ బిక్కి అనిత, రెండో వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్, కో ఆప్షన్ సభ్యులు కొటారి రాఘవరావు, టిఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area