మడుపల్లి ప్రాథమిక పాఠశాలకు 8 బెంచీలు వితరణ అందించిన భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్
Published: Wednesday February 23, 2022
మధిర ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం మడిపల్లి గ్రామం మంగళవారం నాడు ఎం పీ పీ ఎస్ మడుపల్లి బీసీ కాలనీ నందు ఈరోజు భరత్ విద్యా సంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి పాఠశాల కు 8 బెంచీలు వితరణ ఇవ్వడం జరిగింది. దానితోపాటు అదే పాఠశాలలో పనిచేస్తున్న కనపర్తి అర్జున్ వారి దంపతులు ఆ పాఠశాలలోని విద్యార్థులందరికీ షూ లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యా లత మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ సార్ అంగన్వాడి టీచర్ రాధా మాణిక్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.లూక్యా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this on your social network: