రైతులు విజ్ఞప్తి మేరకు కరెంటు పోల్ వేసిన విద్యుత్ శాఖ మధిర

Published: Tuesday July 05, 2022

జూలై 4 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడు*నక్కల గరుబులో ఒరిగిన కరెంట్ స్థంభం.రైతుల విజ్ఞప్తితో యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కరించిన విద్యుత్ అధికారులు.మధిర మండలం నక్కల గరుబులో విద్యుత్ స్థంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది.దీంతో సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామ రైతులు మధిర విద్యుత్ AD సుధాకర్ దృష్టికి  తీసుకువెళ్లారు.స్పందించిన AD సిబ్బందితో యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించారు.తమ సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులు మరియు సిబ్బందికి గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.