జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కొరకు దరఖాస్తులు ఆహ్వానం

Published: Tuesday July 05, 2022
జిల్లా విద్యాధికారిణి జి రేణుకా దేవి
వికారాబాద్ బ్యూరో జూలై 04 ప్రజా పాలన : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాధికారిణి జి రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా యందు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాద్యాయులు మరియు ప్రధానోపాధ్యాయుల నుండి 2022 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కొరకు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఢిల్లీ వారు ఆహ్వానిస్తున్నారని గుర్తు చేశారు.
http://nationalawardstoteachers.education.gov.in website ద్వారా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తు గడువు తేదీ 10 జూలై 2022 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
కావున ఇట్టి అవకాశాన్ని వికారాబాద్ జిల్లా లోని ఉపాద్యాయులు సద్వినియోగం చేసుకోగలరని జిల్లా విద్యా శాఖాధికారిణి జి.రేణుకాదేవి కోరారు. ఎంపిక మార్గదర్శకాల కొరకు పై నున్న వెబ్సైట్ ను సందర్శించినచో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని డి.ఈ.వో తెలిపారు.