హరితహరం మొక్కను తొలగించిన వ్యక్తికి జరిమానా విధించిన మున్సిపల్ సిబ్బంది

Published: Tuesday October 25, 2022
కోరుట్ల,అక్టోబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని ఇందిరా రోడ్ లో నాటిన హరితహారం మొక్కలలో ఒక మొక్కని గోయల్ సాయి అనే వ్యక్తి తొలగించినందుకు అతనికి మున్సిపల్ సిబ్బంది 5000 జరిమానా విధించారు. మరియు అతని చేత ఐదు మొక్కలు నాటించారు. కావున హరితహారం లో నాటిన మొక్కలను ఎవరు తొలగించకూడదని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, హరితహరం ఇంఛార్జి హేమంత్ మునిసిపల్ సిబ్బంది నరేష్ పాల్గొన్నారు.