37వ వార్డులో 21 స్త్రీనిధి సంఘాలకు చెక్కులను పంపిణీ - మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి

Published: Saturday October 02, 2021
జగిత్యాల, అక్టోబర్, 01( ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ 37వ వార్డులో ధైర్యలక్ష్మి స్లమ్ సమాఖ్య లోని 21 మహిళ సంఘాలకు స్త్రీనిధి ద్వారా నలబై లక్షల రూపాయల విలువగల చెక్కులను మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ.శ్రావణి ప్రవీణ్ పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వరూప రాణి, మెప్మా ఏ.ఓ శ్రీనివాస్ గౌడ్, స్త్రీనిది మేనేజర్ మారుతి, డిఎంసి సునీత, టీఎంసీ రజిత, టి.ఎల్.ఎఫ్ ప్రెసిడెంట్ అరుణ, సీవో లు, ఆర్పీ, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.