మధిర బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ

Published: Saturday March 20, 2021

మధిర, మార్చి19, ప్రజాపాలన ప్రతినిధి : మధిర బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ముగ్గులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల అధికారి మందడపు మధు తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో అధ్యక్ష పదవి కోసం బొజేడ్ల పుల్లారావు, కావూరి రమేష్, భైరవభట్ల శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా అవ్వా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా వెంకట్రావు, కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారి జ్ఞానేశ్ ఏకగ్రీవం కానున్నారు. ఆ పదవులకు ఒకే ఒక నామినేషన్ రావడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.