మానవ సేవే మాధవ సేవ

Published: Wednesday August 04, 2021
మధిర, ఆగష్టు 03, ప్రజాపాలన ప్రతినిధి : ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ తొర్రూరు వారిచే. రాష్ట్ర స్థాయి ధర్మశ్రీ సేవ రత్న అవార్డు ను మధిర రెస్క్యూ టీం చైర్మన్ దోర్నాల రామకృష్ణ కు నిస్సి హరినీకు. అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుశ్రీ ఎల్ రమేష్ ఆ.ర్డీ.వో తొర్రూర్. మున్సిపల్ కమిషనర్ గుండె బాబు మున్సిపల్ చైర్మన్. శ్రీ రామచంద్ర మరియు విశ్వంభరి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సువర్ణ కుమారి ముఖులచే ఈ అవార్డు అందజేయటం జరిగింది. అనేక అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆకలితో ఉన్నవారికి రోజు భోజనం అందిస్తూ అనేక రక్త దానంనిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెస్క్యూ టీం కు అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.