మానవ సేవే మాధవ సేవ
Published: Wednesday August 04, 2021
మధిర, ఆగష్టు 03, ప్రజాపాలన ప్రతినిధి : ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ తొర్రూరు వారిచే. రాష్ట్ర స్థాయి ధర్మశ్రీ సేవ రత్న అవార్డు ను మధిర రెస్క్యూ టీం చైర్మన్ దోర్నాల రామకృష్ణ కు నిస్సి హరినీకు. అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుశ్రీ ఎల్ రమేష్ ఆ.ర్డీ.వో తొర్రూర్. మున్సిపల్ కమిషనర్ గుండె బాబు మున్సిపల్ చైర్మన్. శ్రీ రామచంద్ర మరియు విశ్వంభరి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సువర్ణ కుమారి ముఖులచే ఈ అవార్డు అందజేయటం జరిగింది. అనేక అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆకలితో ఉన్నవారికి రోజు భోజనం అందిస్తూ అనేక రక్త దానంనిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెస్క్యూ టీం కు అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
Share this on your social network: