బిజెపి ద్వారానే మహిళలకు రక్షణ
Published: Wednesday July 28, 2021
బాలాపూర్: జులై 27 ప్రజాపాలన ప్రతినిధి : మహిళల ఆత్మగౌరవం, మహిళలకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చేది కేవలం బిజెపి పార్టీ అని మాజీ సింగిల్విండో చైర్మన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయి నగర్ కాలనీకి చెందిన ప్రముఖ విద్యావేత్త అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన ప్రముఖులు లక్ష్మి, తన సహచరులతో మంగళవారం నాడు బీజేపీ పార్టీలోకి చేరారు. రాష్ట్ర నేత మాజీ సింగల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... మహిళల ఆత్మ గౌరవం, మహిళలకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చేది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అన్నారు. కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఒక తెలుగు మహిళకు దక్కిన గౌరవం, అలాగే గతంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పి మహిళా రంగానికి ఇచ్చే గౌరవంగా బిజెపి నిలబడదని తెలిపారు. బీజేపీ ద్వారానే మహిళలకు రక్షణ అభివృద్ధి సాధ్యం అన్నారు. అన్ని వర్గాల మహిళలను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నను అందుకు తనకు రాష్ట్ర నాయకులు సహకారం పూర్తిగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ధనలక్ష్మి శేఖర్ రెడ్డి, రవి కుమార్, పెద్దిటీ సుధాకర్, అర్జున్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు.
Share this on your social network: